TTD: ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువు న‌ష్టం దావా.. టీటీడీ తరఫున వాదించిన ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి

  • ఆంధ్ర‌జ్యోతి క‌ధ‌నంపై టీటీడీ ఫైర్‌
  • రూ.100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా
  • ఇరు వ‌ర్గాల అడ్వకేట్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర వాద‌న‌లు
  • జూన్ 21కి త‌దుప‌రి విచార‌ణ వాయిదా
Defamation suit against Andhra Jyoti adjourns to june 21

తెలుగు దిన‌ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతిపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం దావాపై  మంగ‌ళ‌వారం నాడు తిరుప‌తి నాలుగో అద‌న‌పు జ‌డ్జి కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ విచార‌ణ‌కు టీటీడీ త‌ర‌ఫున న్యాయ‌వాదిగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి హాజ‌ర‌య్యారు. ఇక ఆంధ్ర‌జ్యోతి త‌ర‌ఫు న్యాయ‌వాదిగా క్రాంతిచైత‌న్య హాజ‌ర‌య్యారు.

 ఈ సంద‌ర్భంగా ఇరువురు న్యాయవాదుల మ‌ధ్య వాదోప‌వాదాలు హోరాహోరీగా సాగాయి. ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం నోటీసులు జారీ చేసుకున్నాయి. ఈ నోటీసుల‌పై కౌంట‌ర్లు దాఖ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. విచార‌ణ‌ను జూన్ 21కి వాయిదా వేసింది.

తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబర్‌ 1న ప్రచురించిన కథనంపై ఆ ప‌త్రిక‌పై టీటీడీ రూ.100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు కేసులో ప్రతివాదులుగా ఉన్న నలుగురు న్యాయ కార్య పద్ధతి పాటించకుండా ఉండేలా గత ఏడాది డిసెంబర్‌ 29న సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు అనుమ‌తితో వెన‌క్కు తీసుకున్నారు. 

ఆ వెంట‌నే అక్క‌డికక్క‌డే ఆ పిటిషన్‌పై ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చి పిటిష‌న్‌ను తిరిగి జడ్జికి అంద‌జేశారు. అలాగే ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి టీటీడీ తరఫున 'అడ్వొకేట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 32' కింద ప్రత్యేక అనుమతితో వాదిస్తున్నారని, ఆ అనుమతిని రద్దు చేయాలని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది క్రాంతిచైతన్య కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువురి పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయడానికి జడ్జి కేసును జూన్‌ 21కి వాయిదా వేశారు.

More Telugu News