sitara: త‌న తండ్రి మ‌హేశ్ బాబు గ‌ర్వ‌ప‌డేలా చేస్తాన‌ని చెప్పిన సితార

  • పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా
  • పెన్నీ పాట ప్రోమో విడుద‌ల‌
  • ఇందులో సితార డ్యాన్స్ 
  • సంతోషంగా ఉంద‌న్న సితార‌
sitara dance goes viral

పరశురామ్ దర్శకత్వంలో మ‌హేశ్ బాబు న‌టించిన‌ 'సర్కారువారి పాట' సినిమాలో నుంచి పెన్నీ పాట ప్రోమో విడుద‌లైన విష‌యం తెలిసిందే. మొట్ట‌మొద‌టి సారిగా మహేశ్ బాబు కూతురు సితార ఇందులో డ్యాన్స్ చేసింది. ఆమె ఈ పాట‌లో క‌న‌ప‌డ‌డంతో మ‌హేశ్ బాబు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ పాట‌లో డ్యాన్స్ చేయ‌డం ప‌ట్ల సితార త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది.  

ఈ సాంగ్‌ కోసం సర్కారు వారి పాట వంటి గొప్ప‌ టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది. త‌న‌ను చూసి త‌న తండ్రి గర్వపడేలా చేస్తానని తెలిపింది. కాగా, ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లపై నిర్మిత‌మ‌వుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ న‌టిస్తోంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఈ పాట ఈ రోజు విడుద‌ల కానుంది.

  • Loading...

More Telugu News