Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్‌న్యూస్.. పావుగంట ఆలస్యమైనా ప్రాక్టికల్స్‌కు ఓకే

  • ఈ నెల 23 నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్
  • ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు
  • ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను రిలీవ్ చేయాలని ఆదేశం
  • లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరిక
Telangana Inter Board good news to inter students

ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 9 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 15 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించాలని కళాశాలలను ఆదేశించింది. ఆ తర్వాత మాత్రం అనుమతించవద్దంటూ బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు వారు చదువుకుంటున్న కాలేజీల్లోనే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. జాగ్రఫీ విద్యార్థులకు మాత్రం ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. 

ఈ పరీక్షలకు విద్యార్థులు 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఆదేశించారు. అలాగే, ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయాలని, లేదంటే రూ. 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు ఎగ్జామినర్లు వేసిన మార్కులను అదే రోజు రాత్రి 8 గంటలలోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపాలన్నారు. ప్రాక్టికల్ పరీక్షల హాల్‌టికెట్లు నేటి నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు పేర్కొంది.

More Telugu News