కాషాయంలో తప్పేముంది?: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు
- భారతీయ గుర్తింపును గౌరవంగా భావించాలి
- వలస వాద తత్వాన్ని విడనాడాలి
- మెకాలే నాటి విద్యా వ్యవస్థకు వీడ్కోలు పలకాలన్న ఉపరాష్ట్రపతి
దేవ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకాన్సిలియేషన్ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ భారతీయుడిగా గుర్తింపు పొందడాన్ని గౌరవంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా వలస వాద తత్వాన్ని భారతీయులు విడనాడాల్సి ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు.