Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 52 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!

  • గత 24 గంటల్లో 16,241 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 25 కొత్త కేసులు
  • అనేక జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 91 మంది
  • ఇంకా 738 మందికి చికిత్స
Telangana corona daily report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,241 కరోనా పరీక్షలు నిర్వహించగా, 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో 25 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అనేక జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 7,90,689 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,85,840 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 738 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
.

More Telugu News