Telangana: తెలంగాణలో కొత్తగా 63 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 22,400 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 30 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 102 మంది
  • ఇంకా 777 మందికి చికిత్స
Telangana corona daily updates

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,400 కరోనా పరీక్షలు నిర్వహించగా, 63 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 102 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,90,637 కరోనా కేసులు నమోదు కాగా... 7,85,749 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 777 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో 4,111 మంది మరణించారు.
.

More Telugu News