Chiranjeevi: చిరూ 154లో మరో కథానాయికగా నివేదా పేతురాజ్!

Bobby movie update
  • తెలుగులో నివేదా పేతురాజ్ కి మంచి క్రేజ్
  • 'బ్రోచేవారెవరురా'తో మంచి గుర్తింపు 
  • కలిసిరాని 'పాగల్' సినిమా 
  • బాబీ సినిమాకి గ్రీన్ సిగ్నల్
మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీతో తెలుగు తెరకి పరిచయమైన కథానాయికలలో నివేదా పేతురాజ్ ఒకరు.'మెంటల్ మదిలో' సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆమె కొన్ని సినిమాలు చేసినప్పటికీ, 'చిత్రలహరి' .. 'బ్రోచేవారెవరురా' మాత్రమే మంచి పేరును .. సక్సెస్ ను తెచ్చిపెట్టాయి. 

'రెడ్' .. 'పాగల్' సినిమాలు ఈ సుందరి కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయాయి. ఇక 'విరాటపర్వం'లో నివేద ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమా తనకి తప్పకుండా మరింత మంచి పేరు తీసుకుని వస్తుందని ఆమె భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె చిరంజీవి 154వ సినిమా కోసం ఎంపికైనట్టుగా తెలుస్తోంది.

చిరంజీవి హీరోగా బాబీ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ ను తీసుకున్నారు. ఒక ముఖ్యమైన పాత్ర కోసం రవితేజను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు చిరూ సరసన రెండవ నాయికగా నివేదా కనిపిస్తుందా? రవితేజ జోడీగా మెరుస్తుందా? అనేది చూడాలి.
Chiranjeevi
Sruthi Haasan
Raviteja
Bobby Movie

More Telugu News