Payani: జానీ మాస్టర్ తో మ్యూజిక్ వీడియో రూపొందించిన ఐశ్వర్య... ఆవిష్కరించిన రజనీకాంత్

  • 'పయని' వీడియో గీతానికి ఐశ్వర్య దర్శకత్వం
  • 9 ఏళ్ల తర్వాత డైరెక్షన్ చేపట్టిన ఐశ్వర్య
  • ఎంతో సంతోషంగా ఉందన్న రజనీకాంత్
  • జానీ మాస్టర్, శ్రష్టి వర్మ జంటగా పయని
Rajinikanth releases Payani music video directed by Aishwarya

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య 'పయని' అనే మ్యూజిక్ వీడియో రూపొందించారు. ఈ మ్యూజిక్ సింగిల్ లో ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లీడ్ రోల్ లో నటించడం విశేషం. ఈ వీడియోను తలైవా రజనీకాంత్ నేడు ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, తన కుమార్తె దర్శకత్వం వహించిన 'పయని' మ్యూజిక్ సింగిల్ ను రిలీజ్ చేయడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఐశ్వర్య 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ డైరెక్షన్ చేపట్టిందని రజనీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వివరించారు. 

కాగా, 'పయని' సాంగ్ లో జానీ మాస్టర్ సరసన శ్రష్టి వర్మ నటించింది. ఈ పాటకు అంకిత్ తివారీ బాణీలు అందించగా, అనిరుధ్ ఆలపించారు. తమిళంలో సాగే ఈ పాటకు వివేక సాహిత్యం అందించారు.

More Telugu News