ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్య... అయినా మొక్కలపై మమకారం!
వృక్ష సీమలు, ప్రకృతిపై అపారమైన ప్రేమ కనబరిచే పర్యావరణ ఉద్యమకారుడు వనజీవి రామయ్య (దరిపల్లి రామయ్య) ఖమ్మం జిల్లాలో ఓ ప్రమాదంలో గాయపడ్డారు. రెడ్డిపల్లి బైపాస్ రోడ్డు వద్ద తాను నాటిన మొక్కలకు నీళ్లు పోసేందుకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన కాలుకు తీవ్ర గాయమైంది. వైద్యులు చికిత్స చేసి, నెలరోజుల విశ్రాంతి తప్పనిసరి అని పేర్కొన్నారు.
అయితే, నీళ్లు పోయకపోతే తాను నాటిన మొక్కలు చనిపోతాయని అంటున్న వనజీవి రామయ్య... గాయమైన కాలుతోనే వెళ్లి ఆ మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. మొక్కలను ప్రాణప్రదంగా ప్రేమించే వనజీవి రామయ్య గత 50 ఏళ్లుగా మొక్కలు నాటుతున్నారు. ఆయన సేవలను కేంద్రం గుర్తించి 2017లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
అయితే, నీళ్లు పోయకపోతే తాను నాటిన మొక్కలు చనిపోతాయని అంటున్న వనజీవి రామయ్య... గాయమైన కాలుతోనే వెళ్లి ఆ మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. మొక్కలను ప్రాణప్రదంగా ప్రేమించే వనజీవి రామయ్య గత 50 ఏళ్లుగా మొక్కలు నాటుతున్నారు. ఆయన సేవలను కేంద్రం గుర్తించి 2017లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.