తెలంగాణలో నేడు, రేపు వడగాలులు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
- అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- నల్గొండలో నిన్న 42.4 డిగ్రీల నమోదు
- పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి
- గాలిలో తేమ తగ్గి ఉక్కపోతలు ప్రారంభం
ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ తదితర ప్రాంతాల్లోనూ నిన్న 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు మధ్యాహ్నం పూట అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, గాలిలో తేమ తగ్గిపోవడంతో వాతావరణం పొడిగా మారి ఉక్కపోత ఎక్కువైనట్టు పేర్కొన్నారు.