Mahesh Babu: 'సర్కారువారి పాట' నుంచి రానున్న సెకండ్ సింగిల్ ఎనౌన్స్ మెంట్!

  • పరశురామ్ నుంచి 'సర్కారువారి పాట'
  • మహేశ్ సరసన కీర్తి సురేశ్ 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • మే 12వ తేదీన సినిమా విడుదల 
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ 'సర్కారువారి పాట' సినిమాను రూపొందిస్తున్నాడు. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తుండగా, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. 

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇటీవల ఈ సినిమా నుంచి 'కళావతి' అనే పాటను ఫస్టు సింగిల్ గా వదలగా, 100 మిలియన్ మార్కును టచ్ చేసే ప్రయత్నంలో ఉంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట బీట్ పరంగా .. సాహిత్యం పరంగా మంచి మార్కులు దక్కించుకుంది. 

ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. సెకండ్ సింగిల్ గా ఏ పాటను ఏ రోజున వదిలేది .. ఏ సమయంలో వదిలేది రేపు ప్రకటిస్తామని చెప్పారు. మరి ఈ పాట ఏ రేంజ్ లో దూసుకెళుతుందనేది చూడాలి. ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News