Pawan Kalyan: ఇప్పటంలో ప్రారంభమైన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ... హాజరైన పవన్ కల్యాణ్, నాదెండ్ల, నాగబాబు

  • జనసేన పార్టీకి 8 ఏళ్లు పూర్తి
  • నేడు ఆవిర్భావ దినోత్సవం
  • ఇప్పటం గ్రామం వద్ద సభ ఏర్పాటు
  • భారీగా తరలివచ్చిన జనసైనికులు, అభిమానులు
Pawan Kalyan and leaders attends Janasena formation day rally

జనసేన పార్టీ నేటితో 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ ఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని ఇప్పటం గ్రామం వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు హాజరయ్యారు. సభకు భారీ ఎత్తున జనసైనికులు, పవన్ అభిమానులు తరలివచ్చారు. కాగా సభావేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరిట నామకరణం చేశారు. 

ప్రస్తుతం సభలో జనసేన పార్టీ నేతలు ప్రసంగిస్తున్నారు. పవన్ ప్రసంగం కోసం జనసైనికులు, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో జరిగిన పలు పరిణామాలపై తన సమాధానం ఈ సభ ద్వారా తెలియజేస్తానని పవన్ పేర్కొనడం తెలిసిందే.

More Telugu News