భారత రక్షణ బలగాలను బెదిరించే సాహసం చేయడం సిగ్గుచేటు కేటీఆర్ గారూ!: ఏపీ బీజేపీ నేత విష్ణు
- అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందన
- కంటోన్మెంట్ అధికారులపై కేటీఆర్ ఆగ్రహం
- ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శలు
- నీళ్లు, విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిక
- కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న విష్ణు
దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ, మీ మిత్రపక్షం ఎంఐఎం పార్టీ నేతలను బుజ్జగించేందుకు ఏకంగా భారత రక్షణ బలగాలను బెదిరించే సాహసం చేయడం సిగ్గుచేటు కేటీఆర్ గారూ! అంటూ విమర్శించారు. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి, రక్షణ దళాలకు నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేస్తామని చెప్పడమంటే, దేశం కోసం అమరులైన సైనికుల త్యాగాలను కించపరిచినట్టేనని స్పస్టం చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భారత రక్షణ బలగాలను అవమానపరిచే విధంగా మాట్లాడిన కేటీఆర్ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.