Panchatantram: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న 'పంచతంత్రం' యూనిట్ సభ్యులు

  • రాహుల్ విజయ్, శివాత్మిక నటించిన 'పంచతంత్రం'
  • హర్ష పులిపాక దర్శకత్వంలో చిత్రం
  • విజయవాడలో సందడి చేసిన చిత్రబృందం
  • కేఎల్ యూనివర్సిటీలో 'ఏ రాగమో' పాట ఆవిష్కరణ
Panchatantram unit members visited Vijayawada Kanakadurga temple

రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి తదితరులు నటించిన చిత్రం 'పంచతంత్రం'. ఈ చిత్రంతో హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాగా, ఈ చిత్రబృందం నేడు విజయవాడలో సందడి చేసింది. శివాత్మిక రాజశేఖర్ తదితరులు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. 

అంతేకాదు, కేఎల్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో 'పంచతంత్రం' చిత్రంలోని 'ఏ రాగమో' గీతాన్ని కూడా ఆవిష్కరించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించగా, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం సమకూర్చారు. ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై అఖిలేశ్ వర్ధన్, సృజన్ యరబోలు నిర్మించారు.

More Telugu News