Ramcharan: ఫ్రూటీ అంబాసిడ‌ర్‌గా చెర్రీ... ఆలియాతో క‌లిసి ప్ర‌చారం

  • ఇప్ప‌టికే ఫ్రూటీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఆలియా
  • తాజాగా ఆమెతో క‌లిసి ఆ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా చెర్రీ
  • ఈ జంట ప్రచారంతో అమ్మకాలను మరింత పెంచుకునే ప్రణాళిక  
ram charn is new brand ambassider to frooti

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ఇటు సినిమాల‌తో పాటుగా అటు వాణిజ్య ఉత్ప‌త్తుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపిస్తున్న‌చెర్రీ.. తాజాగా మ‌రో కొత్త ఉత్ప‌త్తికి ప్ర‌చారం చేయ‌నున్నాడు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భ‌ట్‌తో క‌లిసి అత‌డు కొత్త వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించ‌నున్నాడు.

భార‌త బీవ‌రేజెస్ ఉత్ప‌త్తుల్లో అగ్ర‌గామిగా ఉన్న పార్లే అగ్రో సంస్థ ఉత్ప‌త్తి అయిన ఫ్రూటీకి చెర్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఫ్రూటీకి ఆలియా భ‌ట్ ప్రచార‌క‌ర్త‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆలియాతో క‌లిసి చెర్రీ త‌మ బ్రాండ్‌కు ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లుగా పార్లే ఆగ్రో తెలిపింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. 

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఆలియాల‌తో క‌లిసి చెర్రీ..  'ఆర్ఆర్ఆర్' చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త్వ‌రలోనే విడుద‌ల కానుంది. పాన్ ఇండియా సినిమాగా టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో న‌టించిన చెర్రీతో ప్ర‌చారంతో ఫ్రూటీ అమ్మ‌కాల‌ను మ‌రింత‌గా పెంచుకునేందుకే అత‌డిని త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంచుకున్న‌ట్లుగా పార్లే ఆగ్రో త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

More Telugu News