Student: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

  • నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన
  • ఉరేసుకున్న ఫస్టియర్ విద్యార్థి రాములు నాయక్
  • విచారణ జరుపుతున్న పోలీసులు
Student commits suicide in Nujiveedu IIIT

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రిపుల్ ఐటీ ఫస్టియర్ చదువుతున్న రాములు నాయక్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. రాములు నాయక్ స్వస్థలం విజయనగరం జిల్లా గుర్ల మండలం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News