Telugu movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలు ఇవే!

  • మార్చి 3న విడుదలవుతున్న 'హే సినామిక'
  • మార్చి 4న విడుదల కానున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'సెబాస్టియన్ పీసీ 524'
  • ఓటీటీలో వస్తున్న 'డీజే టిల్లు', 'సామాన్యుడు'
Telugu movies to be releases this week

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రిలీజైన 'అఖండ', 'పుష్ప', 'భీమ్లా నాయక్' చిత్రాలు ఘన విజయాలు అందుకోవడంతో టాలీవుడ్ కు కొత్త జోష్ వచ్చింది. ఈ సినిమాలు ఇచ్చిన ధైర్యంతో పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోపక్క, ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.  

థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు:

  • దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన 'హే సినామిక' సినిమా మార్చి 3న విడుదల కానుంది. ఈ సినిమాలో ఆదితిరావు హైదరీ కూడా మరో హీరోయిన్ గా నటించింది. నృత్య దర్శకురాలు బృందా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 
  • భారీ తారాగణంతో తెరకెక్కిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రం మార్చి 4న విడుదలవబోతోంది. ఈ చిత్రంలో శర్వానంద్, రష్మిక, ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి తదితరులు నటించారు. తిరుమల కిశోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా... దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. 
  • కిరణ్ అబ్బవరం మూడో చిత్రం 'సెబాస్టియన్ పీసీ 524' మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేచీకటితో బాధపడే కానిస్టేబుల్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కోమలి ప్రసాద్, నువేక్ష హీరోయిన్లుగా నటించారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

  ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు: 
  • సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన 'డీజే టిల్లు' మార్చి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. 
  • విశాల్, డింపుల్ హయతీ నటించిన 'సామాన్యుడు' చిత్రం మార్చి 4న జీ5లో విడుదల కానుంది.

More Telugu News