Sri Lanka: మూడో టీ20లో టాస్ గెలిచిన శ్రీలంక... విజృంభిస్తున్న భారత బౌలర్లు

  • ధర్మశాలలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • 5 పరుగులకే ఓపెనర్లు అవుట్
Sri Lanka won the toss against Team India

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు చివరి మ్యాచ్ జరుగుతోంది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 5 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 

పత్తుమ్ నిస్సాంక (1)ను ఆవేశ్ ఖాన్ అవుట్ చేయగా, ధనుష్క గుణతిలక (0)ను సిరాజ్ డకౌట్ చేశాడు. కాగా, టీమిండియా ఇప్పటికే ఈ సిరీస్ ను 2-0తో చేజిక్కించుకోవడం తెలిసిందే. దాంతో ఈ చివరి మ్యాచ్ నామమాత్రంగా మారింది.

  • Loading...

More Telugu News