Ukraine: చివ‌రి విద్యార్థిని త‌ర‌లించే దాకా మిష‌న్ ఆగ‌దు: కిష‌న్ రెడ్డి

  • విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌తో కిష‌న్ రెడ్డి చ‌ర్చ‌లు
  • ఉక్రెయిన్‌లోని భార‌త విద్యార్థులు భ‌య‌ప‌డొద్ద‌ని సూచ‌న‌
  • అంద‌రినీ సుర‌క్షితంగా స్వ‌స్థ‌లాల‌కు చేరుస్తామ‌ని భ‌రోసా
Kishan Reddy The mission will not stop until the last student is reached india

ర‌ష్యా మొలుపెట్టిన యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌త్‌కు చెందిన చివ‌రి విద్యార్థిని దేశానికి చేర్చేదాకా భార‌త మిష‌న్ ఆగ‌ద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌త విద్యార్థులంద‌రినీ సుర‌క్షితంగా దేశానికి తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కృష్టి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌త విద్యార్థుల‌ను దేశానికి తీసుకువ‌చ్చే ప‌నిని భార‌త విదేశాంగ శాఖ ఇప్ప‌టికే మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ మిష‌న్‌ను భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ స్వ‌యంగా పర్య‌వేక్షిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో భార‌త విద్యార్థుల త‌ర‌లింపు, అందుకు చేప‌డుతున్న చ‌ర్య‌ల‌పై జైశంక‌ర్‌తో కిష‌న్ రెడ్డి చ‌ర్చించారు. 

ఆ త‌ర్వాత మీడియాతో కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌త విద్యార్థులు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, భార‌త్‌లో ఉంటున్న ఆ విద్యార్థుల త‌ల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా కిష‌న్ రెడ్డి చెప్పారు. ఇప్ప‌టికే 219 మందితో ఓ విమానం ముంబై బ‌య‌లుదేర‌గా.. ఈ రాత్రికే మ‌రో రెండు విమానాలు ఢిల్లీకి రానున్నాయ‌ని కిష‌న్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News