Ukraine: రెండు విమానాల్లో 13 మంది తెలుగు విద్యార్థులు

  • ఇప్ప‌టికే 219 మందితో ముంబై బ‌య‌లుదేరిన తొలి విమానం
  • మ‌రికాసేప‌ట్లో మ‌రో రెండు విమానాలు ఢిల్లీకి ప‌య‌నం
  • వీటిలో ఒక‌దానిలో 8 మంది, రెండో దానిలో 5 మంది తెలుగు విద్యార్థులు
13 Telugu students in two planes

ర‌ష్యా భీక‌ర దాడుల‌తో ఎప్పుడేం జ‌రుగుతుందో తెలియ‌ని ఉక్రెయిన్ నుంచి భార‌త విద్యార్థుల త‌ర‌లింపు శ‌నివారం సాయంత్రం మొద‌లైంది. 219 మందితో ఓ విమానం ఇప్ప‌టికే ముంబైకి బ‌య‌లుదేర‌గా.. మ‌రో రెండు విమానాలు బ‌య‌లుదేర‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు విమానాల్లోని భార‌తీయుల్లో 13 మంది తెలుగు విద్యార్థులున్నారు. ఓ విమానంలో 8 మంది విద్యార్థులు ఉండ‌గా..మ‌రో విమానంలో 5 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు.

ఈ రెండు విమానాల్లో బ‌య‌లుదేర‌డానికి సిద్ధంగా ఉన్న విమానంలో 8 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విమానం టేకాఫ్ త‌ర్వాత బ‌య‌లుదేరే మ‌రో విమానంలో మ‌రో 5 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈ రెండు విమానాలు కూడా నేరుగా ఢిల్లీకి చేరుకోనున్నాయి. తొలి విమానం రాత్రికే ఢిల్లీ చేరుకోనుండ‌గా.., రెండో విమానం ఆదివారం ఉద‌యానికి ఢిల్లీ చేరుకుంటుంది.

More Telugu News