ఏపీలో ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన
- ఏపీలో 26 జిల్లాల ఏర్పాటు
- అభ్యంతరాల స్వీకరణకు మార్చి 3 తుది గడువు
- ఇప్పటిదాకా 1,600 అభ్యంతరాలు
- రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత ఉద్యోగుల విభజన
కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల స్వీకరణకు మార్చి 3 తుది గడువు అని వెల్లడించారు. ఇప్పటివరకు రాయలసీమ ప్రాంతం నుంచి 1,600 అభ్యంతరాలు అందాయని అన్నారు. అభ్యంతరాలను ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని, అన్ని అంశాలు సమీక్షించి జిల్లాలపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కొత్త జిల్లాల్లో ఏప్రిల్ 2 నుంచి పరిపాలన షురూ అవుతుందని తెలిపారు.
కాగా, కొత్త జిల్లాలకు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత ఉద్యోగుల పంపకం ఉంటుందని విజయ్ కుమార్ వివరించారు.