Russia: ఢిల్లీలోని ర‌ష్యా ఎంబసీ వ‌ద్ద ఉక్రెయిన్ జెండాతో యువ జంట నిర‌స‌న‌

  • యుద్ధం నేప‌థ్యంలో ర‌ష్యా ఎంబ‌సీల వ‌ద్ద భ‌ద్ర‌త‌
  • ఢిల్లీలోని ర‌ష్యా ఎంబ‌సీ వ‌ద్దకు చొచ్చుకువ‌చ్చిన‌ యువ జంట
  • అరెస్ట్ చేసి, తరలించిన పోలీసులు

ఉక్రెయిన్‌పై యుద్ధం మొద‌లెట్టిన ర‌ష్యాకు ఇంటా బ‌య‌టా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌పై మిలిట‌రీ ఆప‌రేష‌న్ అంటూ ఏకంగా యుద్ధాన్నే మొద‌లెట్టేసిన ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ వైఖ‌రికి నిర‌స‌న‌గా ర‌ష్యాలో గురువారమే పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. తాజాగా ఢిల్లీలోని ర‌ష్యా రాయ‌బార కార్యాల‌యం వ‌ద్ద కూడా నిరస‌న చోటుచేసుకుంది.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం మొద‌లెట్ట‌గానే.. అన్ని దేశాల్లోని రష్యా రాయ‌బార కార్యాల‌యాల వ‌ద్ద గ‌ట్టి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ర‌ష్యా రాయ‌బార కార్యాల‌యం వ‌ద్ద కూడా భ‌ద్ర‌త‌ను కట్టుదిట్టం చేశారు. అయితే శుక్ర‌వారం సాయంత్రం ఓ యువ జంట ఆ భ‌ద్ర‌తా వ‌ల‌యాన్ని దాటుకుని ఢిల్లీలోని ర‌ష్యా రాయ‌బార కార్యాల‌యం వ‌ద్దకు ఉక్రెయిన్ జెండా ప‌ట్టుకుని ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. దీంతో షాక్ తిన్న పోలీసులు ఆ జంట‌ను అరెస్ట్ చేసి అక్క‌డి నుంచి త‌ర‌లించారు.

More Telugu News