Balakrishna: తండ్రీకొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం?

  • సెట్స్ పైకి వెళ్లిన బాలయ్య 107వ సినిమా
  • దర్శకుడిగా గోపీచంద్ మలినేని 
  • రాయలసీమ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా శ్రుతి హాసన్
Gopichand Malineni movie update

బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను మొదలుపెట్టేశాడు. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా రీసెంట్ గా 'సిరిసిల్ల' జిల్లాలో మొదటి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ అనే విషయం ఇంతకుముందే బయటికి వచ్చింది. అక్కడి నీటి సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా అలరించనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. ప్రతినాయకుడిగా దునియా విజయ్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమా కోసం 'వీరసింహా రెడ్డి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

More Telugu News