Mahesh Babu: 'కళావతి' తరువాత సాంగ్ ను లైన్లో పెడుతున్న తమన్!

  • ముగింపు దశలో 'సర్కారువారి పాట'
  • సంగీత దర్శకుడిగా తమన్
  • కళావతి పాటకి భారీ రెస్పాన్స్
  • మే 12వ తేదీన సినిమా రిలీజ్  
Sarkaru Vaari Paata movie update

ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ ను రాబట్టిన పాటల్లో 'సర్కారువారి పాట' సినిమాలోని 'కళావతి' ఒకటిగా కనిపిస్తుంది. మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశలో ఉంది.

మైత్రీ .. 14 రీల్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. తమన్ ఈ సినిమాకి బాణీలను సమకూర్చాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన 'కళావతి' పాట ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను .. లైక్స్ ను రాబట్టుకుంది.

అనంత్  శ్రీరామ్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన .. కొరియోగ్రఫీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నామనీ. మరో సాంగ్ ను ప్రిపేర్ చేస్తున్నామని తమన్ చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరో సాంగ్ రానుందన్న మాట. మే 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

More Telugu News