BJP: మ‌రోమారు తెలంగాణ‌ బీజేపీ అస‌మ్మ‌తి నేత‌ల భేటీ

  • బండి సంజ‌య్‌కు వ్య‌తిరేకంగా ర‌హ‌స్య భేటీ
  • గ‌త భేటీలో పాల్గొన్న‌వారంతా క‌రీంన‌గ‌ర్ నేత‌లే
  • తాజా భేటీలో క‌రీంన‌గ‌ర్‌తో పాటు హైద‌రాబాద్ నేత‌లూ  
Another meeting of Telangana BJP dissident leaders

కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన తెలంగాణ శాఖ‌లో ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త వివాదాలు రేగుతున్నాయి. బీజేపీ తెలంగాణ చీఫ్‌గా ఉన్న క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌కు వ్య‌తిరేకంగా ఇటీవ‌లే ఆ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు ర‌హ‌స్య భేటీ నిర్వ‌హించిన విష‌యం పెను క‌ల‌క‌ల‌మే రేపింది. దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు అంద‌గా.. జాతీయ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింద‌న్న వాద‌న‌లూ వినిపించాయి. అయితే బండి సంజ‌య్‌కు వ్య‌తిరేక వర్గంగా భావిస్తున్న స‌ద‌రు నేత‌లు మంగ‌ళవారం మ‌రోమారు భేటీ అయి క‌ల‌క‌లం రేపారు.

అత్యంత ర‌హ‌స్యంగా జ‌రిగిన ఈ భేటీలో బీజేపీ తెలంగాణ శాఖ‌కు చెందిన గుజ్జుల రామ‌కృష్ణ‌, సుగుణాక‌ర్‌, వెంక‌ట‌ర‌మ‌ణి, రాములు త‌దిత‌రులు పాల్గొన్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా తొలుత జ‌రిగిన‌ అస‌మ్మ‌తి నేత‌ల స‌మావేశంలో కేవ‌లం క‌రీంన‌గ‌ర్‌కు చెందిన నేతలు మాత్ర‌మే పాల్గొన‌గా.. తాజా భేటీలో క‌రీంన‌గ‌ర్ నేత‌ల‌తో పాటు హైద‌రాబాద్‌కు చెందిన నేత‌లు కూడా పాలుపంచుకున్నార‌ట‌. ఈ వ్య‌వ‌హారం మ‌రోమారు బీజేపీ తెలంగాణ శాఖ‌లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Loading...

More Telugu News