ఈసారి వానలు అంతంత మాత్రమే: స్కైమెట్
- గత రెండుమూడేళ్లుగా దేశంలో పుష్కలంగా వానలు
- ఈసారి సాధారణ వర్షాలేనని స్కైమెట్ అంచనా
- పసిఫిక్ మహాసముద్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా వేడెక్కుతున్నాయని ఏప్రిల్, మే నెలల్లో మరింత వేడెక్కే అవకాశం ఉందని పేర్కొంది. ఫలితంగా రెండేళ్ల నుంచి కొనసాగుతున్న లానినా తటస్థంగా మారి, పసిఫిక్ మహాసముద్రం నుంచి వీచే వేడి గాలుల కారణంగా నైరుతి సీజన్లో వర్షాల జోరు తగ్గుతుందని స్కైమెట్ అంచనా వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్త కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.