మోదీని మళ్లీ గెలిపించడానికి కేసీఆర్ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు: రేవంత్ రెడ్డి
- ముంబయిలో ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్ భేటీ
- బీజేపీ వ్యతిరేక పార్టీలను కూడగట్టే ప్రయత్నం
- యూపీఏను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాడన్న రేవంత్
- కాంగ్రెస్ ను బలహీనపర్చే చర్యలు అని విమర్శలు
మోదీని ఓడించడమే కేసీఆర్ లక్ష్యం అయితే, ఉత్తరప్రదేశ్ లో సభలు పెట్టాలని సవాల్ విసిరారు. యూపీలో ఇప్పటివరకు 3 విడతల ఎన్నికలు జరిగాయని, ఇంకా 4 విడతలు మిగిలున్నాయని, విడతకొక బహిరంగ సభ చొప్పున కేసీఆర్ యూపీలో సభలు జరపాలని రేవంత్ రెడ్డి సూచించారు.
సీఎం కేసీఆర్ నిన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో ముంబయిలో సమావేశం కావడం తెలిసిందే. రేవంత్ రెడ్డి ఈ భేటీపైనే పైవిధంగా స్పందించినట్టు తెలుస్తోంది.