Telangana: తెలంగాణలో మరో 256 మందికి కరోనా పాజిటివ్... తాజా బులెటిన్ ఇదిగో!

  • గత 24 గంటల్లో 25,341 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 107 కొత్త కేసులు
  • ఇంకా 5,135 మందికి చికిత్స
Telangana corona statistics report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,341 కరోనా పరీక్షలు నిర్వహించగా, 256 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 107 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,678 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,77,434 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,135 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News