Nellore District: నెల్లూరు జిల్లాలో వరుస చోరీలు... బెంబేలెత్తుతున్న ప్రజలు

  • సంగం, ఆత్మకూరు మండలాల్లో 8 చోరీలు
  • వారం రోజుల వ్యవధిలో దొంగతనాలు
  • దొంగల స్వైరవిహారం
  • పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
Thieves loots eight places in Nellore district

నెల్లూరు జిల్లాలోని సంగం, ఆత్మకూరు మండలాల్లో వరుస దొంగతనాలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఈ రెండు మండలాల్లో వారం రోజుల వ్యవధిలో 8 చోట్ల చోరీలు జరిగాయి. సంగం, సిద్ధిపూడి గ్రామాల్లో 7 చోట్ల చోరీలు జరిగాయి. ఆత్మకూరు మండలం నల్లపురెడ్డిపల్లిలో 8 తులాల బంగారం, రూ.70 వేల నగదు చోరీ చేశారు.

కొన్ని రోజుల్లోనే ఈ రెండు మండలాల్లో దొంగలు స్వైరవిహారం చేస్తుండడం పట్ల ప్రజలు హడలిపోతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.

More Telugu News