యాంకర్ శ్యామల దంపతులపై సోషల్ మీడియాలో టీడీపీ విమర్శలు
- శ్యామల భర్త ఓ మహిళను మోసం చేశాడన్న టీడీపీ
- అరెస్ట్ అయ్యాడని వెల్లడి
- క్రిమినల్స్ వైసీపీ గూటికే చేరతారని వ్యాఖ్యలు
క్రిమినల్స్ అందరికీ ఒకటే గూడు అని, అది వైసీపీ అని టీడీపీ విమర్శించింది. నేరాల్లో ఒకరికొకరు ఆసరాగా ఉంటారని వ్యాఖ్యానించింది. "సెలబ్రిటీలకు కండువా కప్పడం, వారిని అబద్ధాల ప్రచారాలకు ఉపయోగించుకోవడం... ఇదీ వైసీపీ చేసే పని. వైసీపీని అడ్డంపెట్టుకుని జనాన్ని మోసం చేయడం... ఇది కొందరు సెలబ్రిటీలు చేసే పని" అంటూ ట్విట్టర్ లో వివరించింది.