Manchu Vishnu: సీఎం జగన్ తో ఈరోజు భేటీ కానున్న మంచు విష్ణు

  • ఇటీవలే జగన్ ను కలిసిన సినీ ప్రముఖులు
  • 'మా' అధ్యక్షుడు అయిన తర్వాత జగన్ ను తొలిసారి కలుస్తున్న విష్ణు
  • సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించే అవకాశం
Manchu Vishnu to meet Jagan today

వైజయంతి మూవీస్ ప్రాజెక్ట్ కేఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సినీ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఈరోజు భేటీ కానున్నారు. విష్ణు 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జగన్ ను కలవనుండటం ఇదే తొలిసారి. ఈ భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

మరోపక్క, ఇటీవలే జగన్ ను సినీ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ భేటీకి మోహన్ బాబు హాజరుకాలేదు. ఆ తర్వాత మోహన్ బాబు ఇంటికి మంత్రి పేర్ని నాని వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ను విష్ణు కలవనున్నారు. ఈ భేటీలో సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ ధరల గురించి సీఎంతో విష్ణు చర్చించే అవకాశం ఉంది. దీంతో ఈ భేటీకి ప్రాధ్యాన్యత ఏర్పడింది.

  • Loading...

More Telugu News