Special Committee: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సలహాలు, సూచనల పరిశీలనకు ప్రత్యేక కమిటీ

Special Committee for new districts in AP
  • ఏపీలో 26 జిల్లాలు
  • ఏప్రిల్ 2 నుంచి కార్యకలాపాలు!
  • విజ్ఞప్తుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ
  • సిఫారసులు చేయనున్న కమిటీ
ఏపీలో ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ సెక్రటరీ, అన్ని జిల్లాల కలెక్టర్లు ఉంటారు. కాగా, ఈ కమిటీకి విజ్ఞప్తులు చేసేందుకు ప్రజలకు 30 రోజుల సమయం ఇచ్చారు. ఈ విజ్ఞప్తులను కలెక్టర్లు సేకరిస్తారు. సలహాలు, సూచనలు, అభ్యంతరాలను జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక వెబ్ సైట్ (drp.ap.gov.in)కు ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుండాలి.

ఈ విజ్ఞప్తులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. సహేతుకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు, సవరణలు ఉంటే సిఫారసు చేస్తుంది. ఒకవేళ, విజ్ఞప్తులు అసమంజసంగా ఉన్నట్టు అనిపిస్తే తిరస్కరించాలని సదరు రాష్ట్రస్థాయి కమిటీ సూచిస్తుంది. ఈ కమిటీ చేసిన సిఫారసులపై అంతిమ నిర్ణయం మాత్రం సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీదే. ఉగాది నుంచి కొత్త జిల్లాలు తీసుకురావాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే.
Special Committee
New Districts
Andhra Pradesh
Govt

More Telugu News