Kumaram Bheem Asifabad District: ఇద్ద‌రు 9వ త‌ర‌గ‌తి బాలిక‌ల అదృశ్యం

  • కుమ‌రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘ‌ట‌న‌
  • సిర్పూర్.టి లోని సాంఘిక సంక్షేమ పాఠ‌శాల‌లో చ‌దువుతోన్న విద్యార్థినులు
  • గ‌త‌ రాత్రి ఇద్ద‌రూ క‌లిసి వ‌స‌తి గృహం నుంచి బ‌య‌ట‌కు
  • తిరిగి రాక‌పోవ‌డంతో పోలీసులకు త‌ల్లిదండ్రుల‌ ఫిర్యాదు
girls miss case in asifabad

కుమ‌రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్ద‌రు 9వ త‌ర‌గ‌తి బాలిక‌లు అదృశ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సిర్పూర్.టి లోని సాంఘిక సంక్షేమ పాఠ‌శాల‌లో ఆ ఇద్ద‌రు విద్యార్థినులు చ‌దువుకుంటున్నారు. గ‌త‌ రాత్రి ఇద్ద‌రూ క‌లిసి వ‌స‌తి గృహం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం. అయితే, ఎంత‌కూ తిరిగి రాక‌పోడంతో ఈ విష‌యాన్ని గుర్తించిన వ‌స‌తి గృహం సిబ్బంది ఆ విద్యార్థినుల త‌ల్లిదండ్రుల‌కు ఈ విష‌యం గురించి స‌మాచారం అందించారు.

ఆ విద్యార్థినులు త‌మ‌ ఇళ్ల‌కు కూడా వెళ్ల‌లేద‌ని వ‌స‌తి గృహం సిబ్బంది తెలుసుకున్నారు. వ‌స‌తి గృహం నుంచి స‌మాచారం అంద‌డంతో కంగారు ప‌డ్డ ఆ విద్యార్థినుల త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాలికల ఆచూకీ కోసం పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలనూ ప‌రిశీలిస్తున్నారు.

More Telugu News