AP Pavilion: దుబాయ్ ఎక్స్ పోలో ఏపీ పెవిలియన్ ప్రారంభించిన మంత్రి మేకపాటి

  • దుబాయ్ లో ఎక్స్ పో-2020
  • ఇండియన్ పెవిలియన్ భవనంలో ఏపీ పెవిలియన్ ఏర్పాటు
  • ప్రారంభోత్సవానికి విచ్చేసిన యూఏఈ మంత్రి
Minister Mekapati launches AP Pavilion in Dubai Expo

ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో దుబాయ్ లో ప్రారంభమైన ఎక్స్ పో-2020లో ఏపీ పెవిలియన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఏపీ పెవిలియన్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేడు ప్రారంభించారు. దుబాయ్ లోని ఇండియన్ పెవిలియన్ భవంతిలో ఏపీ పెవిలియన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యూఏఈ విదేశాంగ మంత్రి కూడా హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులు, ప్రాజెక్టులకు సంబంధించిన పుస్తకాన్ని యూఏఈ మంత్రి ఆవిష్కరించారు.

కాగా, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ఏపీ పెవిలియన్ ను తీర్చిదిద్దారు. ఏపీలో పెట్టుబడులు, సానుకూలాంశాలపై ఈ పెవిలియన్ ద్వారా అవగాహన కలిగించనున్నారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్ల వీడియోలను, విద్య, వైద్య, టూరిజం, ఐటీ, పోర్టులపై వీడియోలను పెవిలియన్ లో ప్రదర్శిస్తారు. ఏపీలో మౌలిక సదుపాయాలు, ఎగుమతి అవకాశాలపై వివరణ కోసం 12 స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News