Sourav Ganguly: హృదయ సంబంధ ఆరోగ్య పరీక్షల కోసం బెంగళూరులో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ

  • రేపు, ఎల్లుండి ఐపీఎల్ వేలం
  • వేలం కోసం బెంగళూరులో ఉన్న గంగూలీ
  • నారాయణ హెల్త్ సిటీ ఆసుపత్రిలో కార్డియాక్ పరీక్షలు
Sourav Ganguly joined Bengaluru hospital

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలో రెండు పర్యాయాలు యాంజియోప్లాస్టీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హృదయ సంబంధ వైద్య పరీక్షల కోసం ఆయన తాజాగా బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీ ఆసుపత్రిలో చేరారు. నారాయణ హెల్త్ సిటీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ దేవి శెట్టి నేతృత్వంలోని వైద్యుల బృందం గంగూలీకి కార్డియాక్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. దీనికోసం గంగూలీ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఈ నేపథ్యంలో, కార్డియాక్ వైద్య పరీక్షల్లో భాగంగా నారాయణ ఆసుపత్రికి వచ్చారు.

More Telugu News