Shreyas Iyer: సత్తా చాటిన అయ్యర్... టీమిండియా 265 ఆలౌట్

  • అహ్మదాబాద్ లో మూడో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • అయ్యర్, పంత్ అర్ధసెంచరీలు
  • రాణించిన సుందర్, చహర్
Shreyas Iyer hits another valuable knock

అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ లో శ్రేయాస్ అయ్యర్ మరోసారి ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా ఆరంభంలోనే 3 వికెట్లు చేజార్చుకోగా... రిషబ్ పంత్ (56)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన అయ్యర్, జట్టును సురక్షితమైన స్థితిలో నిలిపాడు. అయ్యర్ 111 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (6) విఫలం కాగా, వాషింగ్టన్ సుందర్ (33), దీపక్ చహర్ (38) ధాటిగా ఆడారు.

ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేయగా, ఓపెనర్ ధావన్ 10 పరుగులు చేసి నిరాశపరిచాడు. మాజీ కెప్టెన్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4 వికెట్లు తీయగా, అల్జారీ జోసెఫ్ 2, హేడెన్ వాల్ష్ 2 వికెట్లు పడగొట్టారు. ఓడియన్ స్మిత్, ఫాబియెన్ అలెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

More Telugu News