Ramcharan: త్రివిక్రమ్ దర్శకత్వంలో చరణ్!

  • 'డీజే టిల్లు' రేపు రిలీజ్ అవుతుంది
  • 'భీమ్లా నాయక్' నిర్మాతగా హ్యాపీ
  • చరణ్ అంటే నాకు చాలా ఇష్టం
  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ఉందన్న నాగవంశీ
Chran in Trivikram Movie

సితార బ్యానర్ వారు వరుస సినిమాలతో .. వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. వారి తాజా చిత్రంగా నిర్మితమైన 'డీజే టిల్లు' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాగా 'భీమ్లా నాయక్' విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"పవన్ కల్యాణ్ తో ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ, ఎవరికీ కూడా అలా అనిపించదు. అంతగా త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేశారు. మళ్లీ పవన్ తో మరో సినిమా చేయాలనుంది. ఆ విషయాన్ని గురించి ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నాను.

ఇక చరణ్ అంటే నాకు చాలా ఇష్టం .. ఈ బ్యానర్లో ఆయనతో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఈ బ్యానర్లో హీరోగా చరణ్ చేసే సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో సెట్స్ పైకి వెళ్లనున్న త్రివిక్రమ్, ఆ తరువాత ఎన్టీఆర్ తో ఒక పాన్ ఇండియా ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాడు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News