సీఎం జగన్ కేవలం హీరోలతోనే చర్చలు జరుపుతారా?: జనసేన
- సమస్యను తనకు తానుగా సృష్టిస్తోన్న జగన్
- జగన్ వద్దకు వచ్చి బతిమిలాడాల్సిందేనా?
- చర్చలకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఎందుకు పిలవలేదు?
- మరి అమరావతి రైతులను ఎందుకు పిలిపించుకుని మాట్లాడట్లేదు? అని నాదెండ్ల ప్రశ్నలు
సీఎం జగన్ కేవలం హీరోలతోనే చర్చలు జరుపుతారా? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. 'హడావుడిగా హీరోలను పిలిచి మాట్లాడారు. విశాఖకు సినీ పరిశ్రమ రావాలని చెప్పారు. మరి అమరావతి రైతులను ఎందుకు పిలిపించుకుని మాట్లాడడం లేదు?' అని ఆయన నిలదీశారు. మహారాజులాగా కూర్చొని, పబ్లిసిటీ కోసం ఇటువంటి చర్యలకు జగన్ పాల్పడుతున్నారని అన్నారు. తన వద్దకు వచ్చి మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న విషయాన్ని చెప్పడానికే జగన్ హీరోలతో చర్చించారని ఆయన చెప్పారు.