Legendary cricketer: రాష్ట్రపతిని కలిసిన లెజండరీ క్రికెటర్ సచిన్

  • ముంబైలోని రాజ్ భవన్ లో సమావేశం
  • పలు అంశాలపై చర్చ
  • మర్యాదపూర్వక భేటీయే
sachin tendulakr met with president ramnath kovind

క్రికెట్ దిగ్గజం, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు. ముంబై వచ్చిన రామ్ నాథ్ తో రాజ్ భవన్ లో శుక్రవారం సచిన్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది.

పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఇది మర్యాద పూర్వక భేటీయేనని తెలుస్తోంది. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జులై 25తో ముగియనుంది. మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడం గమనార్హం.  

More Telugu News