TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

  • దర్శనం టికెట్లను పెంచుతున్న టీటీడీ
  • కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం
  • కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లు
TTD announces increase Tirumala darshan tickets

శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలిపింది. శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్టు చెప్పారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లను జారీ చేస్తామని తెలిపారు.

అలాగే ఈ నెల 16న ఉదయాస్తమాన సేవా టికెట్లను విడుదల చేస్తామని చెప్పారు. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన వారికి ఈ టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా విరాళమిచ్చిన భక్తులకు ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేస్తామని... ఈ టికెట్ల బుకింగ్ కు ప్రత్యేక పోర్టల్ జారీ చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News