Dubai Expo-2020: దుబాయ్ ఎక్స్ పో-2020లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి మేకపాటి

  • ఫిబ్రవరి 11 నుంచి దుబాయ్ ఎక్స్ పో
  • పాల్గొంటున్న ఏపీ
  • ట్విట్టర్ లో వెల్లడించిన మంత్రి మేకపాటి
  • కంపెనీలు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి
AP Minister Mekapati says AP participates Dubai Expo

దుబాయ్ పారిశ్రామిక ప్రదర్శనలో ఏపీ కూడా పాల్గొంటోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దుబాయ్ ఎక్స్ పో-2020లో ఏపీ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఎక్స్ పో ఫిబ్రవరి 11న ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. యూఏఈలోని వివిధ కంపెనీలు, వ్యాపార సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాయని భావిస్తున్నామని, ఏపీలో అమలు చేస్తున్న స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటారని ఆశిస్తున్నామని మంత్రి మేకపాటి వివరించారు.

More Telugu News