Appala Raju: ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజుకు విశాఖ శారదాపీఠం వద్ద అవమానం

  • సీఎం పర్యటన సందర్భంగా అక్కడకు  వెళ్లిన మంత్రి
  • అనుచరులను తీసుకెళ్లకుండా ఒక్కరే వెళ్లాలన్న సీఐ
  • అప్పలరాజు ముఖం మీదే గేటు వేసిన వైనం
YSRCP minister Appala Raju insulted by CI

ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజుకు ఘోర అవమానం ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విశాఖ శారదాపీఠానికి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని ఒక సీఐ స్పష్టం చేశారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతుండగా... మీరు ఒక్కరే వెళ్తే వెళ్లండి లేకపోతే లేదు అంటూ ఆయన ముఖం మీదే గేటు వేశారు. దీంతో షాక్ కు గురైన మంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. అంతే కాదు మంత్రి అని కూడా చూడకుండా సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు.

More Telugu News