ajit agarkar: బెంగళూరు ఫ్రాంఛైజీ కొన్నేళ్లుగా వేలంలో అవ‌స‌ర‌మైనంత భారీ ఖ‌ర్చు చేయ‌ట్లేదు: అజిత్ అగార్క‌ర్

  • కోహ్లీని ఆర్సీబీ కొనుగోలు చేయాలి
  • ఆ టీమ్ ఎల్ల‌ప్పుడూ టాప్‌-3 ఆటగాళ్లపైనే ఆధారపడుతోంది
  • మిడిల్ ఆర్డర్‌లో సరైన ఆటగాళ్లను తీసుకోలేకపోయింది
ajit agarkar on ipl auction

త‌దుప‌రి ఐపీఎల్‌ సీజన్ గురించి టీమిండియా మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్ స్పందిస్తూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీ అంశంపై మాట్లాడారు. ఐపీఎల్‌ 14వ సీజన్ అనంత‌రం విరాట్ కోహ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. త‌దుప‌రి ఐపీఎల్ సీజన్‌ కోసం ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

ఈ వారాంతం జరిగే ఐపీఎల్‌ మెగా వేలంలోనే ఆ ప‌ని పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. దీనిపై అజిత్‌ అగార్కర్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... విరాట్‌ కోహ్లీ మళ్లీ ఆ జ‌ట్టు సార‌థిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి మ‌న‌స్ఫూర్తిగా ఒప్పుకుంటే ఆర్సీబీకి అదే మంచిదని చెప్పారు. బెంగళూరు ఫ్రాంఛైజీ కొన్నేళ్లుగా సరైన జట్టును కొనుగోలు చేసేందుకు అవ‌స‌ర‌మైనంత భారీ ఖ‌ర్చు చేయ‌లేద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

బెంగ‌ళూరు టీమ్ ఎల్ల‌ప్పుడూ టాప్‌-3 ఆటగాళ్లపైనే ఆధారపడిందని ఆయ‌న అన్నారు. ఆ జ‌ట్టు మిడిల్ ఆర్డర్‌లో సరైన ఆటగాళ్లను తీసుకోలేకపోయిందని చెప్పారు. ఈ సీజ‌న్‌లోనూ తగినంత ఖ‌ర్చు చేయ‌లేని స్థితిలో ఉంటే ఒక్క ఆటగాడి కోసం భారీ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఎందుకంటే గొప్ప‌ ఆటగాడైనా కొన్ని మ్యాచ్‌లు గెలిపిస్తాడు కానీ, క‌ప్పు సాధించిపెట్ట‌లేడ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News