India: మొదలైన టీ20 ప్రపంచకప్ టికెట్ల విక్రయం.. హాట్ కేకుల్లా అమ్ముడైన భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు

  • ఈ ఏడాది అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టోర్నీ
  • అక్టోబరు 23న భారత్-పాక్ ఢీ
  • గంటలోనే అమ్ముడుపోయిన టికెట్లు
India pakistan t20 world cup match tickets sold in one hour

భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే అది ఎక్కడ జరిగినా, ఏ స్థాయిలో జరిగినా ఆ మజానే వేరు. దీనిని ఆస్వాదించేందుకు ప్రపంచం నలుమూలల ఉన్న క్రికెట్ అభిమానులు ఉత్సాహం చూపుతుంటారు. తాజాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మరోమారు తలపడనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్ల విక్రయం నిన్న ప్రారంభం కాగా, దాయాదుల మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గంటలోపే టికెట్లు అన్నీ ఖాళీ కావడం గమనార్హం.

ఈ ఏడాది అక్టోబరు 16 నుంచి నవంబరు 13 మధ్య ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అక్టోబరు 23న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఫైనల్‌తో మొత్తం 45 మ్యాచ్‌ల టికెట్లను కూడా విక్రయానికి ఉంచారు. పిల్లలకు 5 డాలర్లు (రూ. 373), పెద్దలకు 20 డాలర్లు (1,493) నిర్ణయించారు. అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, హాబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలలో మ్యాచ్‌లు జరుగుతాయి.

  • Loading...

More Telugu News