Jagananna Chedodu Scheme: రేపు 'జగనన్న చేదోడు' పథకం నిధుల విడుదల

  • దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు లబ్ది
  • ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు
  • రూ.285 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్
  • షాపులు ఉన్నవారికి లబ్ది
Jagananna Chedodu scheme benefits will be released tomorrow

రాష్ట్రంలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నిధులను రేపు సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఒక్క బటన్ క్లిక్ చేసి దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ మేరకు మొత్తం రూ.285 కోట్లు విడుదల చేయనున్నారు. కాగా, ఈ ఏడాది జగనన్న చేదోడు పథకం కింద షాపులు కలిగి ఉన్న 1.46 లక్షల మంది దర్జీలు , 98 వేల మంది రజకులు, 40 వేల మంది నాయీ బ్రాహ్మణులకు లబ్ది చేకూరనుంది.

More Telugu News