Andhra Pradesh: ఏపీలో మరో 3,396 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 29,838 కరోనా టెస్టులు
  • రాష్ట్రంలో 9 మంది మృతి
  • ఇంకా 78,746 మందికి చికిత్స
AP Corona Statistics

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,838 శాంపిల్స్ పరీక్షించగా... 3,396 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 516 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 494, పశ్చిమ గోదావరి జిల్లాలో 398, గుంటూరు జిల్లాలో 360 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 13,005 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,00,765 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,07,364 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 78,746 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,655కి పెరిగింది.

More Telugu News