Balakrishna: హిందూపురంను కొత్త జిల్లా కేంద్రం చేయాలంటూ.. రేపు పట్టణంలో బాలకృష్ణ ర్యాలీ

  • పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం
  • అంబేద్కర్ విగ్రహం వద్ద బాలయ్య మౌనదీక్ష
  • ఉద్యమ కార్యాచరణపై అఖిలపక్ష నేతలతో చర్చలు 
Balakrishna conducts rally in Hindupur for new district

కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు హిందూపురంను కేంద్రంగా చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపు ఉదయం హిందూపురంలో ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరగనుంది. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఉద్యమ కార్యాచరణపై రేపు సాయంత్రం అఖిలపక్ష నేతలతో చర్చించనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు.

More Telugu News