బడ్జెట్లో కేంద్రమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్న శాఖకు రూ. 900 కోట్ల కేటాయింపు
- గతేడాది జులైలో సహకార శాఖ ఏర్పాటు
- సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం
- ‘సహకార సంఘాల అభ్యున్నతి’ పథకానికి రూ. 274 కోట్లు
సహకార సంఘాలపై ప్రత్యామ్నాయ కనీస పన్ను (ఏఎంటీ) 15 శాతానికి, సర్చార్జ్ 7 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం ఏఎంటీ 18.5 శాతం, సర్చార్జ్ 12 శాతం ఉన్నాయి. బడ్జెట్లో కేటాయించిన రూ. 900 కోట్ల నిధుల్లో రూ. 350 కోట్లను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) డిజిటలైజేషన్ కోసం ఖర్చు చేస్తారు. రూ. 274 కోట్లను ‘సహకార సంఘాల అభ్యున్నతి’ పథకం కోసం వెచ్చిస్తారు.