Jinnah Tower: గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చే ప్రసక్తేలేదు: మేయర్ మనోహర్ నాయుడు

  • గుంటూరులో ప్రసిద్ధ కట్టడంగా జిన్నా టవర్
  • సోము వీర్రాజు అభ్యంతరం
  • జిన్నా దేశ విభజనకు కారకుడని బీజేపీ విమర్శలు  
  • మతపెద్దలతో నేడు ప్రజాప్రతినిధుల సమావేశం
Guntur mayor Manohar Naidu says never change the name of Jinnah Tower

ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేయడం తెలిసిందే. దేశవిభజనకు కారకుడైన మహ్మద్ అలీ జిన్నా పేరును మనదేశంలోని స్థూపానికి ఎలా పెడతారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జిన్నా పేరు తొలగిస్తామని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, నేడు జిన్నా టవర్ అంశంపై మతపెద్దలతో ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు, నగరపాలక కమిషనర్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిన్నా టవర్ వద్ద ఎల్లుండి జాతీయ జెండా ఆవిష్కరించాలని ముక్తకంఠంతో తీర్మానించారు. మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ, జిన్నా టవర్ పేరు మార్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.

More Telugu News