Union Budget: కేంద్ర బడ్జెట్ తో తగ్గేవి, పెరిగేవి... వివరాలు ఇవిగో!

  • పలు రంగాల్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • దిగుమతులపై సుంకం పెంపు
  • చౌకగా మొబైల్ ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు   
What cheaper and what costlier after Union Budget

కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్ ను నేడు ప్రవేశపెట్టారు. 2022-23 బడ్జెట్ తో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అనేక రకాల వస్తువులు చౌకగా లభ్యం కానున్నాయి. మరికొన్ని వస్తువులు ప్రియం కానున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా, కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. ఈ బడ్జెట్ ద్వారా ధరలు తగ్గేవి, పెరిగేవి ఏమిటంటే...

ఇవి చౌకగా లభిస్తాయి..

  • మొబైల్ ఫోన్లు
  • మొబైల్ ఫోన్ చార్జర్లు
  • మొబైల్ ఫోన్ చార్జింగ్ ట్రాన్స్ ఫార్మర్లు
  • వజ్రాలు (కట్ అండ్ పాలిష్డ్), రత్నాలు
  • పలు రకాల అనుకరణ ఆభరణాలు (ఇమిటేషన్ జ్యుయెలరీ)
  • పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగించే కెమికల్స్
  • మిథనాలు, మరికొన్ని రసాయనాలు
  • కెమెరా లెన్సులు
  • స్టీల్ స్క్రాప్
  • వ్యవసాయ పరికరాలు
  • దుస్తులు
  • పాదరక్షలు
  • విదేశీ యంత్ర సామగ్రి
  • తోలు వస్తువులు
  • వినికిడి పరికరాలు

ధరలు పెరిగేవి...

  • అనేక రకాల దిగుమతి వస్తువులు
  • విదేశీ గొడుగులు
  • క్రిప్టో లావాదేవీలు
  • హెడ్ ఫోన్లు 
  • ఇయర్ ఫోన్లు 
  • లౌడ్ స్పీకర్లు 
  • స్మార్ట్ మీటర్లు
  • సోలార్ ప్యానెళ్లు
  • ఎక్స్ రే మెషీన్లు 


More Telugu News